విశాఖలో పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్.. ఆరుగురు మంత్రుల బృందంతో కమిటీ

by Naga Rani Yarlagadda |

కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులే లక్ష్యంగా చర్యలు తీసుకుంటోంది.

విశాఖలో పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్.. ఆరుగురు మంత్రుల బృందంతో కమిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులే లక్ష్యంగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో విశాఖలో నవంబర్ 14,15 తేదీల్లో పార్ట్నర్ షిప్ సమ్మిట్ (Vizag Partnership Summit) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం కొన్ని కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఆరుగురు మంత్రుల బృందంతో కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఈ బృందానికి మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)ను ఛైర్మన్ గా నియమించింది. కమిటీలో సభ్యులుగా మంత్రులు టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, నారాయణ, కొండపల్లి శ్రీనివాస్ లు ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. సమ్మిట్ లో వసతులు, ఏర్పాట్లకు సంబంధించి మరో 9 వర్కింగ్ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు.

Next Story