Delhi: అమిత్ షాతో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

by Disha Web Desk 16 |
Delhi: అమిత్ షాతో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీ సీఎం, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. శుక్రవారం ఢిల్లీలో బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి అనంతరం కేంద్రమంత్రులను, పార్టీ ప్రముఖులను కలుస్తున్నారు. తాజాగా శనివారం ఉదయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర హోంశాఖమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. కిరణ్ కుమార్ రెడ్డి వెంట పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి సైతం ఉన్నారు. త్వరలోనే కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీలో కీలకమైన పదవి రాబోతుందని తెలుస్తోంది.

Next Story

Most Viewed