బీజేపీ నాయకుడిపై చెప్పుతో దాడి.. డిప్యూటీ సీఎం స్వగ్రామంలో తీవ్ర ఉద్రిక్తత

by Disha Web Desk 16 |
బీజేపీ నాయకుడిపై చెప్పుతో దాడి.. డిప్యూటీ సీఎం స్వగ్రామంలో తీవ్ర ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు గ్రామం అనకాపల్లి జిల్లా తాడువలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ గ్రామంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో బీజేపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం.. చెప్పుతో బీజేపీ నాయకుడిపై దాడి చేశారు. అలాగే అక్కడ జరిగిన ఘర్షణలో నలుగురు కూటమి కార్యకర్తలకు గాయాలయ్యాయి. కారు, రెండు బైకులు ధ్వంసం అయ్యాయి. దీంతో సీఎం రమేశ్‌ను డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఇంటి వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు ఎన్నికల ప్రచారం చేసుకోవాలని సీఎం రమేశ్‌కు సూచించారు. ప్రస్తుతం పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాడువలో భారీగా మోహరించారు.

Next Story

Most Viewed