AP | టీడీపీ సీనియర్ నేత మరణం.. ముఖ్యమంత్రి విచారం

by Thanuru Gopichand |

టీడీపీ సీనియర్ నేత, ఎన్టీఆర్ వీరాభిమాని కళ్యాడపు ఆగయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారకరం వ్యక్తం చేశారు.

AP | టీడీపీ సీనియర్ నేత మరణం.. ముఖ్యమంత్రి విచారం
X

దిశ, వెబ్ డెస్క్ : టీడీపీ సీనియర్ నేత, ఎన్టీఆర్ వీరాభిమాని కళ్యాడపు ఆగయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారకరం వ్యక్తం చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆగయ్య పార్టీకి సేవలందిస్తున్నారన్నారు. ఈ మధ్యనే మహానాడు వేదికగా ఆయనను కలిసినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణతో కలిసి ఘనంగా సత్కరించుకున్నామని గుర్తు చేసుకున్నారు. ఎంతో అంకితభావంతో పార్టీకి ఆగయ్య చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు. ప్రతి టీడీపీ కార్యకర్తలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆగయ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Next Story