Breaking: ఢిల్లీకి సీఎం జగన్.. మూడు రోజుల షెడ్యూల్ ఇదే..

by Disha Web Desk 16 |
Breaking: ఢిల్లీకి సీఎం జగన్.. మూడు రోజుల షెడ్యూల్ ఇదే..
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. తాడేపల్లి నుంచి గన్నవరం వెళ్లిన ఆయన అక్కడి నుంచి విమానంలో హస్తినకు చేరుకున్నారు. మూడు రోజుల పాటు సీఎం జగన్ ఢిల్లీలోనే ఉండనున్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను ఇప్పటికే కలిశారు. పెండింగ్ నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే నీతిఆయోగ్ 8వ పాలక మండలి సమావేశంలో జగన్ పాల్గొననున్నారు.

అలాగే ఎల్లుండి జరిగే పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం హాజరుకానున్నారు. అలాగే ఏపీకి రావాల్సిన నిధులు, విభజన సమస్యలు, ప్రత్యేక హోదా వంటి అంశాపైనా ప్రధాని మోదీతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వివేకానందారెడ్డి హత్య కేసు విచారణ వేగం పుంజుకున్న నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అవినాశ్ రెడ్డి అరెస్ట్ వార్తలు ప్రచారం జరుగుతుండటంతో తమ్ముడిని కాపాడుకునేందుకు ఢిల్లీ పెద్దల వద్దకు సీఎం జగన్ వెళ్తున్నారని ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు.

Next Story

Most Viewed