వారికి ఫ్రీ కరెంట్.. మరో రెండు రోజుల్లో అమలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-05 14:53:44  IST  )

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు..

వారికి ఫ్రీ కరెంట్.. మరో రెండు రోజుల్లో అమలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు. తాము అధికారంలోకి వస్తే చేనేతలకు ఉచిత కరెంట్ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు తాజాగా కసరత్తులు చేశారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. చేనేత మగ్గాలకు 200, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్ ఇచ్చే అంశంపై అధికారులతో పలుమార్లు చర్చించారు. విద్యుత్ శాఖతో పలు అధికారులు, మంత్రులు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ హామీ నెరవేర్చాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. హ్యాండ్ లూమ్ వస్త్రాలపై జీఎస్టీ విషయంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ జీఎస్టీ మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని తాజాగా జరిగిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 5 కోట్ల మంది నేతన్నలు ఉన్నారని, వారందరికీ త్రిఫ్ట్ ఫండ్ కేటాయిస్తామని చంద్రబాబు తెలిపారు.అలాగే నేతన్నలకు ఉచిత విద్యుత్‌ను జాతీయ చేనేత దినోత్సవం నుంచి అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

Next Story