సీఎం జగన్‌కు ప్రాణహాని.. ఇంటెలిజెన్స్ నివేదిక విడుదల

by Disha Web Desk 14 |
సీఎం జగన్‌కు ప్రాణహాని.. ఇంటెలిజెన్స్ నివేదిక విడుదల
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పర్యటనల కోసం రెండు హెలికాప్టర్లు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు వాడుతున్న హెలికాప్టర్‌‌ను మార్చడంతో పాటు మరో దానిని తీసుకోవాలని యోచిస్తోంది. విజయవాడ, విశాఖ పరిధిలో ఈ హెలికాప్టర్లను వినియోగించాలని భావిస్తున్నారు.

ఇంటెలిజెన్స్ డీజీ, ప్రొటోకాల్ విభాగాల సిఫార్సులతో అత్యాధునిక హెలికాప్టర్లను సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే సీఎం జగన్‌కు ప్రాణహాని ఉందని, మావోయిస్టులు, టెర్రరిస్టులు, సంఘ విద్రోహ శక్తుల నుంచి ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ డీజీపీ ఇవాళ ఓ నివేదిక ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత భద్రత కల్పించాలని పేర్కొన్నారు.


Next Story