బక్కని నర్సింహులకు చంద్రబాబు క్లాస్.. తెలంగాణపై జాగ్రత్తగా మాట్లాడాలని సూచన

by Vemula.Srinu Prasad |

టీటీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులకు ఏపీ సీఎం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నారు..

బక్కని నర్సింహులకు చంద్రబాబు క్లాస్.. తెలంగాణపై జాగ్రత్తగా మాట్లాడాలని సూచన
X

దిశ, వెబ్ డెస్క్: టీటీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహుల(TTDP Politburo Member Bakkani Narsimhulu)పై ఏపీ సీఎం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) క్లాస్ తీసుకున్నారు. తెలంగాణ అనే పథం డిక్షనరీలో లేదని మహానాడు(Mahanadu)లో ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఎంతో చరిత్ర, నేపథ్యం ఉన్న ప్రాంతాలపై జాగ్రత్తగా మాట్లాడాలని చంద్రబాబు సూచించారు. ఏ ఒక్కరి మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడకూడదని ఆదేశించారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ గడ్డపైనే పుట్టిందని తెలిపారు. ఆ రాష్ట్రంలో టీడీపీ ఇప్పటికీ చాలా బలమైన కేడర్ ఉందని చెప్పారు. తెలంగాణ నుంచి మహానాడులో పాల్గొన్న పార్టీ శ్రేణులకు చంద్రబాబు అభినందలు తెలిపారు. మహానాడులో ఆమోదించిన 33 శాతం మహిళా రిజర్వేషన్ల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు.


Next Story