జనసేన, బీజేపీ పొత్తు సంకేతాలు బలంగా వినిపించాలి

by GSrikanth |   (  Updated:2023-08-12 13:46:38  IST  )

రాష్ట్ర కార్యవర్గ నేతలతో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఇవాళ వర్చువల్‌ సమావేశం నిర్వహించారు.

జనసేన, బీజేపీ పొత్తు సంకేతాలు బలంగా వినిపించాలి
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర కార్యవర్గ నేతలతో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఇవాళ వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. సర్పంచుల సమస్యలపై పోరాటం బాగా చేశారంటూ నేతలకు ఆమె అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో జనసేన, బీజేపీ పొత్తు సంకేతాలు బలంగా వినిపించాలని కోరారు. ఇంటింటికీ త్రివర్ణ పతాకంలో అందరినీ భాగస్వాములను చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 14న విభాజిత్‌.. విభీషణ్‌ కార్యక్రమం చేపట్టాలని నాయకులకు సూచించారు.

Next Story