HYD: మాజీ సీఎం ఇంట్లో ఏపీ బీజేపీ నేతల కీలక సమావేశం.. పొత్తులపై కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
HYD:   మాజీ సీఎం ఇంట్లో  ఏపీ బీజేపీ నేతల కీలక సమావేశం.. పొత్తులపై కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ బీజేపీ నేతలు హైదరాబాద్‌లో సమావేశం అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజుతో పాటు కీలక నేతలంతా హాజరయ్యారు. ఏపీలో బీజేపీ బలోపేతం, పొత్తులపై చర్చించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానన్నారు. పార్టీ ఆదేశాల మేరకు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తానని చెప్పారు. ఇప్పుడున్న ప్రభుత్వంపై రోడ్లపై మాట్లాడటం సరికాదని, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతానని పేర్కొన్నారు.

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ పార్టీ బలోపేతంపై కిరణ్ కుమార్ రెడ్డి సలహాలు తీసుకునేందుకు వచ్చానమని చెప్పారు.

బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మాట్లాడుతూ పొత్తుల నిర్ణయం హైకమాందేనని చెప్పారు. ఎన్నికలకు 2 నెలల ముందు పొత్తులు ఖరారవుతాయన్నారు. ఏపీలో ప్రస్తుతం జనసేనతో పొత్తులో ఉన్నామని సత్యకుమార్ స్పష్టం చేశారు.


Next Story

Most Viewed