- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొనసాగుతున్న వలసల పర్వం.. టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మరో ఎంపీ
ఏపీలో ఎన్నికలకు కొద్ది రోజులే ఉన్న సమయంలో.. టికెట్ దక్కక అసంతృప్తితో ఉన్న అధికార వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా టీడీపీలో చేరుతున్నారు

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో ఎన్నికలకు కొద్ది రోజులే ఉన్న సమయంలో.. టికెట్ దక్కక అసంతృప్తితో ఉన్న అధికార వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా టీడీపీలో చేరుతున్నారు. ఈ నేపధ్యంలోనే నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు వైసీపీకి షాక్ ఇచ్చి టీడీపీలో చేరారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో టీడీపీ రా.. కదలిరా బహిరంగ సభ నిర్వంహించింది.
ఈ సభలో చంద్రబాబు సమక్షంలో వైసీపీ ఎంపీ లావుతో పాటు మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు సహా పలువురు నాయకులు టీడీపీ కండువా కప్పుకున్నారు. కాగా నరసరావుపేట వైసీపీ ఎంపీగా ఉన్న లావు కృష్ణదేవరాయలుకు వైసీపీ అధిష్టానం మరోసారి అదే స్థానం నుంచి పోటీ చేసేందుకు నిరాకరించింది. దీనిపై అసంతృప్తితో ఉన్న ఆయన ఇవ్వాళ టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. దీంతో నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి టీడీపీ తరుపున లావుకు సీటు ప్రకటించే అవకాశం ఉంది.
Read More..
Next Story






