పవన్ కల్యాణ్‌కు హరిరామ జోగయ్య మరో సంచలన లేఖ

by Sathputhe Rajesh |   (  Updated:2024-03-01 14:45:15  IST  )

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు హరిరామ జోగయ్య మరో సంచలన లేఖ రాశారు.

పవన్ కల్యాణ్‌కు హరిరామ జోగయ్య మరో సంచలన లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు హరిరామ జోగయ్య మరో సంచలన లేఖ రాశారు. తన సలహాలు పవన్‌కు నచ్చినట్లు లేవన్నారు. పవన్ లేకుండా టీడీపీ నెగ్గడం అసాధ్యమన్నారు. ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసన్నారు. ఎన్నికల తర్వాత జనసేనను నిర్వీర్యం చేసి.. లోకేష్‌ను సీఎం చేస్తారన్న భయం జనసేన కార్యకర్తల్లో ఉందన్నారు. ఎన్నికలకు ముందే పవన్ స్థానం ఎంటో చెప్పాలని.. కార్యకర్తల తరఫున డిమాండ్ చేస్తే తప్పేంటి అన్నారు.

తనను వైసీపీ కోవర్టుగా చిత్రీకరిస్తున్నారని ఫైర్ అయ్యారు. మిత్రులెవరో.. శత్రువులు ఎవరో పవన్ తెలుసుకోవాలని సూచించారు. ప్యాకేజీ వీరుడంటూ పవన్‌పై విమర్శలు చేస్తుంటే.. చంద్రబాబు మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. పవన్‌కు ఇష్టమున్నా లేక పోయినా అయన వెంటే ఉంటా అన్నారు. పవన్ కల్యాణ్‌ను కాపాడుకోవడం తన బాధ్యతగా భావిస్తా అన్నారు. చచ్చే వరకు తన ప్రవర్తన ఇలాగే ఉంటుందని తేల్చి చెప్పారు. పవన్ లక్ష్యానికి తన మద్దతు ఎప్పటికి ఉంటుందన్నారు.

Read More..

కాస్త ఆగు బ్రదర్..! నాగబాబు దూకుడుకు తమ్ముడు పవన్ కల్యాణ్ బ్రేకులు

Next Story