Mangalagiri AIIMS : ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్

by Muthe.Rajitha |

ఏపీ(AP)కి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది.

Mangalagiri AIIMS : ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)కి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. ఏపీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో భారీగా వైద్యుల నియామకానికి చర్యలు చేపట్టింది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్(Mangalagiri AIIMS) ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న దాదాపు 534 పోస్టుల భర్తీ చేయాలంటూ జారీ చేసింది. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వినతులపై కేంద్రం సానుకూలంగా స్పందించి, ఆర్థిక శాఖకు ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరి ఎయిమ్స్ పోస్టుల భర్తీ నిర్ణయంపై కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్(Nirmala Sitaraman), జేపీ నడ్డాకు పెమ్మసాని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై ఏపీ ప్రజలకు స్థానికంగానే మెరుగైన వైద్యం అందుతుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

Next Story