వైసీపీలో భగ్గుమన్న వర్గ విబేధాలు (వీడియో వైరల్)

by Disha Web Desk 16 |
వైసీపీలో భగ్గుమన్న వర్గ విబేధాలు (వీడియో వైరల్)
X

దిశ, వెబ్ డెస్క్: అనంతరపురం జిల్లా గుంతకల్లు నియోజకరవర్గం పామిడి మండలంలో వైసీపీ నాయకులు బుధవారం ఉదయం వైయస్ఆర్ ఆసరా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి, ఏడీసీపీ బ్యాంక్ చైర్ పర్సన్ లిఖితతో పాటు మాజీ చైర్మెన్ వీరాంజనేయులు పాల్గొన్నారు. అయితే వీరి మధ్య ఒక్కసారిగా వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఏడీసీపీ బ్యాంక్ చైర్మెన్ లిఖితకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ ఎమ్మెల్యేతో మాజీ చైర్మెన్ పామిడి వీరాంజనేయులు ఘర్షణ పడ్డారు. టైమ్ లేదని, మాట్లాడేందుకు అవకాశం ఇవ్వనని, ఇక్కడి నుండి వెళ్లి పొమ్మని ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో మాజీ చైర్మెన్ పామిడి వీరాంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం తారాస్థాయికి చేరుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దీంతో ఇద్దరి మధ్య వివాదం సర్దుమణిగింది.

Next Story

Most Viewed