- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోల్డ్ లోన్ సంస్థలో భారీ చోరీ.. విచారణలో బయటపడిన ఇంటి దొంగల పనితనం
గోల్డ్ లోన్ సంస్థను నమ్మి ప్రజలు బంగారం తాకట్టు పెడితే ఇంటి దొంగలు వాటిని కొట్టేశారు....

దిశ, వెబ్ డెస్క్: గోల్డ్ లోన్ సంస్థ(Gold Loan Company)ను నమ్మి ప్రజలు బంగారం తాకట్టు పెడితే ఇంటి దొంగలు వాటిని కొట్టేశారు. ఎవరికీ తెలియదులే అనుకుని యధేచ్చగా చోరీ చేశారు. వాటిని ఏం చేశారో తెలియదు గాని.. వారిపై మాత్రం కేసు నమోదు అయింది. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ(Uravakonda)లో జరిగింది. ఉరవకొండలో ఓ ప్రైవేటు గోల్డ్ సంస్థను ఏర్పాటు చేసి ప్రజలకు బంగారంపై రుణాలు ఇస్తున్నారు.. దీంతో డబ్బులు అవసరం నిమిత్తం పట్టణ ప్రజలు ఈ సంస్థలో బంగారం పెట్టి లోన్ తీసుకున్నారు. అంతేకాదు తీసుకున్న రుణానికి ప్రతి నెల వడ్డీ కడుతున్నారు.
అయితే ఆ బంగారంపై ఇంటి దొంగల కన్నుపడింది. కొద్ది కొద్దిగా చోరీ చేశారు. ఇందులో మేనేజర్ హస్తం ఉండటం గమనించదగిన విషయం. ఉద్యోగులతో కలిసి మేనేజర్ పక్కా ప్లాన్ ప్రకారం బంగారాన్ని కొట్టేశారు. రూ. 56 లక్షల విలువైన 1,158 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లిపోయారు. సంస్థ యాజమానికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇంటిదొంగల గుట్టు రట్టు అయింది. మేనేజర్ సహా నలగురు ఉద్యోగులపై కేసు నమోదు అయింది. ఈ విషయం బయటకు తెలియడంతో గోల్డ్ తాకట్టు పెట్టిన వారంతా స్థానికంగా ఆందోళనకు దిగారు. తమకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అయితే అందరికీ న్యాయం చేస్తామని పోలీసులు, సంస్థ యాజమాన్యం చెప్పడంతో శాంతించారు.






