- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దొంగల బీభత్సం.. తుపాకులతో బెదిరించి 25 తులాల బంగారం దోపిడీ
శ్రీసత్యసాయి జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు...

దిశ, వెబ్ డెస్క్: శ్రీసత్యసాయి జిల్లాలో దోపిడీ దొంగలు(Robbers) బీభత్సం సృష్టించారు. హిందూపురం మండలం కిరకెరలో రాత్రి సమయంలో ఓ ఇంట్లోకి చొరబడ్డారు. తుపాకులతో బెదిరించి దంపతులను బంధించారు. అనంతరం 25 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. స్థానిక సీసీ టీవీ ఫుటేజులను ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన దుండగులుగా అనుమానిస్తున్నారు. దొంగలను త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా కిరకెరలో కొందరు దుండగులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని తెలిపారు. గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని తాము భయపడుతున్నట్లు తెలిపారు. పోలీసులు రాత్రి సమయంలో పెట్రోలింగ్ను పెంచాలని, దొంగల బెడదను నివారించాలని కోరుతున్నారు.






