Anantapur: ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే..

by Disha Web Desk 16 |
Anantapur: ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే..
X

దిశ కళ్యాణదుర్గం: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ సారథ్యంలో ఏబీసీడీ వర్గీకరణ కోసం ఏప్రిల్ 4న విజయవాడలో మాదిగ సంగ్రామ పాదయాత్ర తలపెట్టారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లాలో నాలుగు రోజులు క్రితం ప్రారంభమైన ఈ పాదయాత్ర తాజాగా కంబదూరుకు చేరుకుంది.

ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందే..

ఈ సందర్భంగా కంబదూరు ఆర్టీసీ బస్టాండు వద్ద అంబేద్కర్ విగ్రహం నుంచి చెక్ పోస్ట్ సర్కిల్ లక్ష్మిదేవమ్మ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాల్సిందేనని నినాదాలు చేశారు. అప్పటి వరకూ తమ ఉద్యమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, నియోజకవర్గ, మండల ఎమ్మార్పీఎస్ నాయకులు, దళిత నాయకులు, వాల్మీకి సేవా సమితి నియోజకవర్గ నాయకులు ములకనూరు గోవింద్, ఎంపీటీసి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed