- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గంగమ్మ ఆలయంలో ఈవో చేతివాటం.. అమ్మవారి ఆభరణాలు చోరీ
గంగమ్మ ఆలయంలో ఈవో చేతివాటం ప్రదర్శించారు..

దిశ, వెబ్ డెస్క్: చేతివాటానికి స్థలపురాణంతో పనిలేదని ఇప్పటికే పలుమార్లు రుజువు అయింది. కొందరు వ్యక్తులు జనాల సొమ్మే కాదు.. దేవుడి సొత్తును సైతం వదిలిపెట్టడం లేదు. ఆలయంలో పని చేస్తూ ఆ దేవుడికే శఠగోపం పెడుతున్నారు. ఇలాంటి ఘటన కోకొల్లులుగా ఉన్నా తాజా ఘటనలో ఆలయ ఈవో చేతివాటాన్ని జనాలు తిప్పి కొట్టారు. తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా ఎర్రదొడ్డిలో జరిగింది. స్థానిక గంగమ్మ ఆలయంలో అమ్మవారికి వెండి ఆభరణాలు అలంకరించి ప్రతినిత్యం పూజలు నిర్వహిస్తున్నంటారు అక్కడి జనం. అయితే ఈ ఆభరణలాలపై ఈవో మురళీకృష్ణ కన్ను పడింది. ఆదివారం కావడంతో ఈ రోజు చేతివాటాన్ని ప్రదర్శించారు. అమ్మవారి సొమ్ములను దోచేశారు. ఆటోలో వెళ్లి అమ్మవారి 5 కేజీల వెండి ఆభరణాలు తీసుకెళ్లారు. దీంతో స్థానికులు గుర్తించి ఆటోను అడ్డుకున్నారు. ఈవోను పట్టుకుని వెండి ఆభవరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఆలయ ఈవోను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణ అనంతరం ఏం జరుగుతుందో చూడాలి.






