High Alert App: దంపతుల కిడ్నాప్.. ఛేదించిన పోలీసులు

by Disha Web Desk 16 |
High Alert App: దంపతుల కిడ్నాప్.. ఛేదించిన పోలీసులు
X

దిశ కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం మండలం దురదకుంటకు చెందిన దంపతులు హనుమంతరాయుడు, కళావతిని కొందరు 2 కార్లలో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. దీంతో డయల్ 100కు సమాచారం అందింది. ఈ మేరకు హై అలెర్ట్ యాప్ ద్వారా ఉమ్మడి అనంతపురం జిల్లా పోలీసులకు ఎస్పీ సమాచారం ఇచ్చారు. ముదిగుబ్బలో ఎస్ఐ హేమంత్ కుమార్ వాహన తనిఖీల్లో భాగంగా వేగంగా వెళ్తున్న 2 కార్లను ఆపి తనిఖీ చేశారు. ఇద్దరిని కిడ్నాప్ చేసినట్లు గుర్తించి పట్టుకున్నారు. కార్లను సీజ్ చేశారు. నిందితులను అదుపులోక తీసుకున్నారు.



Next Story

Most Viewed