నెల క్రితం ఆలయంలో చోరీ.. తప్పు అయింది తల్లి అంటూ దొంగల లేఖ.. పూర్తి డబ్బుతో..

by Sujitha Rachapalli |

చోరీ చేసినోళ్లు దొరికిపోవుడు కామన్ కానీ చోరీ చేసిన డబ్బును మళ్లీ వెనక్కి తెచ్చి ఇవ్వడం రేర్. కానీ ఇక్కడ అదే జరిగింది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలోని ముసలమ్మ ఆలయంలో నెల క్రితం చోరీ జరిగింది.

నెల క్రితం ఆలయంలో చోరీ.. తప్పు అయింది తల్లి అంటూ దొంగల లేఖ.. పూర్తి డబ్బుతో..
X

దిశ, వెబ్ డెస్క్ : చోరీ చేసినోళ్లు దొరికిపోవుడు కామన్ కానీ చోరీ చేసిన డబ్బును మళ్లీ వెనక్కి తెచ్చి ఇవ్వడం రేర్. కానీ ఇక్కడ అదే జరిగింది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలోని ముసలమ్మ ఆలయంలో నెల క్రితం చోరీ జరిగింది. దాదాపు రెండు లక్షల సొత్తు ఉన్న హుండీని ఎత్తుకెళ్లారు. కాగా నెల రోజులయ్యాక తప్పు అయిందంటూ డబ్బును మొత్తాన్ని చోరీ చేసిన స్థలంలోనే పెట్టి పోయారు. ఓ లేఖ కూడా జోడించారు. ‘తప్పయింది తల్లి. ఈ చోరీ కారణంగా నా కొడుకు జబ్బు పడ్డాడు. నలుగురం దొంగతనం చేసినం. కొంచెం డబ్బు వినియోగించాం. క్షమించమ్మా’ అని లేఖలో రాసుకొచ్చాడు. కాగా దొంగలు రిటర్న్ చేసిన మనీ రూ.1,86,486 అని తెలిపారు ఆలయ నిర్వాహకులు.

Next Story