- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అర్హతలేని వాడు రాష్ట్రాన్ని ఏలుతున్నాడు.. వలంటీర్లు వైసీపీ ప్రైవేట్ సైన్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమదే అనే భ్రమలో జగ్గు భాయ్ అండ్ గ్యాంగ్ ఉన్నారు అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమదే అనే భ్రమలో జగ్గు భాయ్ అండ్ గ్యాంగ్ ఉన్నారు అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జగ్గు భాయ్ గ్యాంగ్ భ్రమలను త్వరలోనే తొలగిస్తామని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. తాడేపల్లి గూడెం నియోజకవర్గం జనసేన పార్టీ శ్రేణఉల సమావేశంలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వలంటీర్లే వైసీపీకి ప్రైవేటు సైన్యం అని ఆరోపించారు. సాక్షి పేపర్ కోసం ఏటా రూ. 48 కోట్లు ప్రజాధనం లూటీ చేస్తున్నారని పవన్ ఆరోపించారు. అర్హతలేని వాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలుతున్నాడు అంటూ పవన్ కల్యాణ్ ఘాటు విమర్శలు చేశారు.
Next Story






