- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీం 2025 విధి విధానాలు జారీ
by Naga Rani Yarlagadda |
రాజధాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్ స్కీం - 2025 (Amaravati Land Pooling Scheme - 2025) విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.

X
దిశ, వెబ్డెస్క్ : రాజధాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్ స్కీం - 2025 (Amaravati Land Pooling Scheme - 2025) విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు తెలుపుతూ సమగ్ర నోటిఫికేషన్ ను విడుదల చేసింది. రాజధాని కోసం భూములు ఇచ్చే రైతులకు వర్తింపజేసే ప్రయోజనాలను ఆ నోటిఫికేషన్ లో వివరించింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలో మరో 40 వేల ఎకరాల భూమిని సమీకరించనున్నట్లు గతవారం మంత్రి నారాయణ తెలిపారు. ల్యాండ్ పూలింగ్ స్కీం నిబంధనలు ఉంటాయని, ల్యాండ్ పూలింగ్ నిబంధనలు 2025ను సీఆర్డీఏ (CRDA) నోటిఫై చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.
Next Story






