CM జగన్‌తో అల్లు అర్జున్ వెయ్యికోట్ల ఒప్పందం.. కోపంతో రగిలిపోతున్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్!

by Disha Web Desk 2 |
CM జగన్‌తో అల్లు అర్జున్ వెయ్యికోట్ల ఒప్పందం.. కోపంతో రగిలిపోతున్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మధ్య రాజకీయ వైరం ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జగన్‌ను ఓడించడమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ టీడీపీతో జతకట్టి మరీ ఈసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. అంతేకాదు.. ఏకంగా ముఖ్యమంత్రి రేసు నుంచి తప్పుకొని మరీ వైసీపీకి ఓటమికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ రాష్ట్ర రాజకీయాలతో పాటు మెగా ఫ్యామిలీని కుదిపేసేలా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వార్త అటు జనసైనికులకు, ఇటు టీడీపీ శ్రేణులతో పాటు మెగా ఫ్యాన్స్‌కు కూడా మింగుడు పడటం లేదు.

అయితే, వైజాగ్‌లో మెగా హీరో అల్లు అర్జున్ భారీ స్థాయిలో పెట్టబడులు పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో చర్చలు కూడా జరిగాయని.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం చేస్తున్న "విజన్ విశాఖ" అభివృద్ధి మంత్రానికి ఫిదా అయ్యి ఈ పెట్టుబడులకు సిద్ధమైనట్లు సమాచారం. ఇదే గనుక నిజమైతే ఇక అల్లు vs మెగా ఫ్యాన్స్ మధ్య మరో యుద్ధం జరుగడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు మధ్య తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. ఇక ఈ వార్తపై ఎవరెలా స్పందిస్తారో తెలియక వైసీపీ శ్రేణులు సతమతమవుతున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

Read More..

బ్రేకింగ్.. సీఎం జగన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం


Next Story

Most Viewed