- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
JD లక్ష్మీనారాయణ పార్టీకి గుర్తు కేటాయించిన ఈసీ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గుర్తించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన.. తర్వాత చోటుచేసుకున్న పరిణామాల రీత్య ఆయన జనసేనకు రాజీనామా చేశారు.

దిశ, వెబ్డెస్క్: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గుర్తించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన.. తర్వాత చోటుచేసుకున్న పరిణామాల రీత్య ఆయన జనసేనకు రాజీనామా చేశారు. ప్రస్తుతం సొంతంగా పార్టీ(జై భారత్ నేషనల్ పార్టీ) పెట్టుకొని బరిలోకి దిగబోతున్నట్లు ప్రకటించారు. తాజాగా జేడీ లక్ష్మీనారాయణ పార్టీకి ఎన్నికల సంఘం టార్చ్లైట్ గుర్తును కేటాయించింది. దీనిపై జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. కామన్ సింబల్గా టార్చ్లైట్ గుర్తును కేటాయించడంపై ఈసీకి ధన్యావాదాలు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టార్చ్లైట్ వెలిగిస్తాం.. చీకటిని తరిమేస్తామని అన్నారు. ఇద్దరు రాజుల మధ్య ఓ సామాన్యుడి పోరాటం జరుగుతోందని తెలిపారు. కాగా, ఈ సారి విశాఖ నార్త్ నుంచి JD లక్ష్మీనారాయణ పోటీ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
Read More..
పవన్ కల్యాణ్ను ఒక్క మాట అనడానికి వీళ్లేదు.. సొంత నేతలకు వర్మ రిక్వెస్ట్






