- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కొనసాగుతున్న భక్తుల రద్దీ

దిశ,వెబ్డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల చేరుకుని.. భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు.
ఈ తరుణంలో తిరుమలలో భక్తుల రద్దీ కొన్ని సార్లు సాధారణంగా లేదా అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో నేడు(మంగళవారం) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు భక్తులు వేచి చూస్తున్నారు. కంపార్టుమెంట్లన్నీ నిండి టీబీసీ క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉంటే.. నిన్న(సోమవారం) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని 73,078మంది భక్తులు దర్శించుకున్నారు. 25,831 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.3.58 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు వెల్లడించారు.