ఎయిరిండియా నిర్వాకం.. విమాన టికెట్‌పై టైం తప్పు పడటంతో..

by Disha Web Desk 4 |
ఎయిరిండియా నిర్వాకం.. విమాన టికెట్‌పై టైం తప్పు పడటంతో..
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. టికెట్ పై ఎయిర్ ఇండియా టైం తప్పుగా ముద్రించడంతో ప్రయాణికులు ఫ్లయిట్ మిస్ అయ్యారు. కువైట్ విమానం మధ్యాహ్నం 1:10 గంటలకు ఉండటంతో ఎయిర్ పోర్టుకు 11 మంది ప్రయాణికులు చేరుకున్నారు. అప్పటికే 67 మందితో విమానం కువైట్ వెళ్లిపోవడంతో ప్రయాణికులు ఎయిరిండియా అదికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ డబ్బులు రిఫండ్ చేస్తామని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి: పాలీష్ మాయ.. అధికార పార్టీ నేతల జేబులు నింపుతోన్న చౌక బియ్యం



Next Story

Most Viewed