- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీశైలం పాతాళగంగలో ప్రమాదం
శ్రీశైలం(Srisailam) పాతాళగంగలో భక్తులకు పెను ప్రమాదం తప్పింది.

దిశ, వెబ్డెస్క్: శ్రీశైలం(Srisailam) పాతాళగంగలో భక్తులకు పెను ప్రమాదం తప్పింది. మంగళవారం మధ్యాహ్నం శ్రీశైలం రోప్వే దగ్గర కొండచరియలు(Landslides) విరిగిపడ్డాయి. భక్తులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాల కారణంగా శ్రీశైలంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో తరచూ తెలంగాణ వైపునకు వచ్చే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవలే భారీవర్షాల కారణంగా శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారిపై లింగాలగట్టు వద్ద తెల్లవారుజామున కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో యాత్రికులు చాలా ఇబ్బంది పడ్డారు. బస్సులు కదలకపోవడంతో వందలాది మంది యాత్రికులు అవస్థలు పడ్డారు. దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల్లో అల్పాహారం, మంచినీరు, పాలు, బిస్కెట్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా వారంలో రెండోసారి కొండచరియలు విరిగిపడటం కలకలం రేపుతోంది.






