దేవుడా జస్ట్ మిస్.. పట్టాల మధ్యలో పడుకుని ప్రాణాలు కాపాడుకున్న కార్మికుడు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-16 06:27:33  IST  )

రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ రైల్వే స్టేషన్‌లో పట్టాల మధ్యలో పడుకుని కార్మికుడు ప్రాణాలు కాపాడుకున్నారు...

దేవుడా జస్ట్ మిస్.. పట్టాల మధ్యలో పడుకుని ప్రాణాలు కాపాడుకున్న కార్మికుడు
X

దిశ, వెబ్ డెస్క్: అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు సమయస్పూర్తితో తప్పించుకోవాలని అంటారు. కానీ, చాలా చోట్ల భయపడి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలే జరిగాయి. తాజాగా ఓ కార్మికుడు(Worker) చాలా తెలివిగా ప్రాణముప్పు నుంచి బయటపడ్డారు. రెప్పపాటులో పోవాల్సిన ప్రాణాలను కాపాడుకుని మృత్యుంజయుడిగా నిలిచారు. ఈ భూమి మీద తనకు ఇంకా నూకలు ఉన్నాయని నిరూపించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా(Rangareddy District) తిమ్మాపూర్ రైల్వే స్టేషన్(Timmapur Railway Station) దగ్గర జరిగింది.

కంపెనీలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ వద్ద ట్రాక్ దాటేందుకు ఓ కార్మికుడు ప్రయత్నించారు. అయితే అక్కడున్న గూడ్స్ రైలు(Goods Train) సడెన్‌గా కదిలింది. దీంతో వెంటనే రైలు పట్టాలపై పడుకున్నారు. తృటిలో ప్రాణాపాయం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. రైలు వెళ్లిపోయిన తర్వాత దేవుడా అంటూ లేచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యమలోకాన్ని దగ్గర నుంచి చూసి తిరిగి వచ్చాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Next Story