పట్టాలపై గోవును ఢీకొట్టిన రైలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

by Vemula.Srinu Prasad |

ప్రకాశం జిల్లా చీరాలలో రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది....

పట్టాలపై గోవును ఢీకొట్టిన రైలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా చీరాల(Chirala)లో రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. పట్టాలు దాటుతున్న గోవు(Cow)ను రైలు ఢీకొట్టింది. దీంతో రైలు చక్రాల మధ్య గోవు కళేబరం(Carcass) ఇరుక్కుపోయింది. దీంతో రైలు పట్టాలపైనే ఆగిపోయింది. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తీవ్రంగా శ్రమించి గోవు కళేబరాన్ని తొలగించారు. దీంతో రైలు ముందుకు నడిచింది. ఈ ఘటనతో చెన్నై- విజయవాడ-గుంటూరు మధ్య రూట్‌లో పలు రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యాయి

Next Story