లోక్ సభలో వారి పక్కన సీటు వద్దు: MP రఘురామ కీలక నిర్ణయం

by Disha Web Desk 19 |
లోక్ సభలో వారి పక్కన సీటు వద్దు: MP రఘురామ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నేత, నర్సాపురం ఎంపీ రఘురామరాజు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. లోక్ సభలో తనకు ప్రత్యేక సీటు కేటాయించాలని.. లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు విజ్ఞప్తి చేశారు. నూతన పార్లమెంట్ భవనంలో వైసీపీ సభ్యుల సరసన కాకుండా.. వేరుగా సీటు కేటాయించాలని స్పీకర్‌ను కోరారు. సభలో వైసీపీ సభ్యులు నన్ను మాట్లాడనివ్వడం లేదని.. సొంత పార్టీ నేతలే నాపై దాడి చేస్తారన్న భయం ఉందని పేర్కొన్నారు. తనను వైసీపీ ఎంపీగా కాకుండా.. స్వతంత్ర సభ్యుడిగా పరిగణించాలని ఎంపీ రఘురామ లేఖలో కోరారు. జగన్ ప్రభుత్వం తనపై దాఖలు చేసిన కేసులు, పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీల బెదిరింపుల ఉదంతాలను లేఖలో పొందుపర్చారు.

Read more :

చంద్రబాబు, పవన్ భేటీపై మంత్రి విడదల రజినీ ఫైర్

Next Story