కడప మేయర్ సంచలన నిర్ణయం.. కమిషనర్ సహా ఏడుగురు ఉద్యోగులకు బిగ్ షాక్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-21 12:14:22  IST  )

కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది..

కడప మేయర్ సంచలన నిర్ణయం..  కమిషనర్ సహా ఏడుగురు ఉద్యోగులకు బిగ్ షాక్
X

దిశ, వెబ్ డెస్క్: కడప మున్సిపల్ కార్పొరేషన్(Kadapa Muncipal Corporation)లో షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. కమిషనర్ సహా ఏడుగురు ఉద్యోగుల(Employees)కు మేయర్ సురేశ్ బాబు షోకాజ్ (Mayor Suresh Babu) నోటీసులు జారీ చేశారు. విధులు సరిగా నిర్వహించలేదని, వారంలో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా శుక్రవారం మేయర్ అధ్యక్షతన కడప కార్పొరేషన్‌లో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఈ ఏడుగురు ఉద్యోగులు హాజరుకాలేదు. దీంతో మేయర్ సురేశ్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సమావేశానికి ఎందుకు రాలేదో సరైనా వివరణ ఇవ్వాలని ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తనకున్న అధికారంతోనే నోటీసులు జారీ చేసినట్లు సురేశ్ బాబు తెలిపారు.

Next Story