తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగీత దర్శకుడు

by Jakkula.Mamatha |

తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని నిత్యం వేలాది మంది దర్శించుకుంటారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగీత దర్శకుడు
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని నిత్యం వేలాది మంది దర్శించుకుంటారు. ఈ క్రమంలో సినీ సంగీత దర్శకుడు తమన్(Thaman) తిరుమల శ్రీవారిని ఈ రోజు(ఆదివారం) ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు. మరోవైపు తెలంగాణ(Telangana) రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి(High Court Justice) జస్టిస్ పి.శ్రీసుధ, రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు టీటీడీ అధికారులు(TTD Officers) వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Next Story