ప్రధాని మోడీ కీలక సమావేశం... ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-14 03:50:36  IST  )

ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎన్డీయే కీలక భేటీ కాబోతోంది..

ప్రధాని మోడీ కీలక సమావేశం... ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) తర్వాత ఎన్డీయే కీలక భేటీ(Nda Meeting) కాబోతోంది. ఈ నెల 25న ప్రధాని మోడీ(Pm Modi) ఆధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. ఎన్టీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు(Cm), ఉప ముఖ్యమంత్రులు(Deputy Cm) సైతం హాజరుకానున్నారు. ఆపరేషన్ సింధూర్, రాజకీయ స్థితి గతులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. జాతీయ సమైక్యతా సందేశాన్ని వినపించనున్నారు. రాజకీయ ప్రచారాలకు దూరంగా ఉండాలని ఇప్పటికే కేబినెట్ మంత్రులకు ప్రధాని మోదీ సూచించారు. ఆపరేషన్ సింధూర్ విజయం భారత సైన్యానిదేనని బీజేపీ నేతలు అంటున్నారు. ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆపరేషన్ సిందూర్ కొనసాగతుందని చెబుతున్నారు.

Next Story