రూ.300 కూలీకి వెళితే రూ.40 లక్షల వజ్రం దొరికింది?

by Thanuru Gopichand |

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో గ్రామానికి చెందిన కూలీని అదృష్టం వరించింది.

రూ.300 కూలీకి వెళితే రూ.40 లక్షల వజ్రం దొరికింది?
X

దిశ డైనమిక్ బ్యూరో : కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో గ్రామానికి చెందిన కూలీని అదృష్టం వరించింది. అతనికి 40లక్షల వజ్రం లభ్యం అయినట్లు సమాచారం. 300 రూపాయలు కూలి పనికి వెళ్ళిన వ్యవసాయ కూలీకి వజ్రం దొరికిందని వార్త గుప్పుమంది. వ్యవసాయ కూలీకి దొరికిన వజ్రాన్ని ఓ 40 లక్షలకు వజ్రాల వ్యాపారి కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. వర్షాలు కురిస్తే ఈ ప్రాంత పొలాలలో వజ్రాలు దొరకడం తెలిసిన విషయమే. ఈ సీజన్లో లభ్యమైన అత్యంత విలువైన వజ్రం ఇదే అని స్థానికులు చెబుతున్నారు

Next Story