వామ్మో.. 2 చేపలు రూ. 4 లక్షలా? ఎందుకంత స్పెషల్?

by Disha Web Desk 14 |
వామ్మో.. 2 చేపలు రూ. 4 లక్షలా? ఎందుకంత స్పెషల్?
X

దిశ, డైనమిక్ బ్యూరో: మార్కెట్‌లో చెపలకున్న డిమాండ్ అందరికీ తెలిసిందే. అందులోనూ అరుదైన చేపలకు రూ. లక్షల్లో ధరలు పలుకుతాయి. మత్యకారులకు అలాంటి అరుదైన చేపలు పడితే వారికి లక్ష్మీదేవి కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా కృష్ణా జిల్లా మత్స్యకారులకు అంతర్వేది సముద్ర తీరంలో అరుదైన రెండు కచ్చిడీ అనే చేపలు చిక్కాయి.

ఈ చేపలు ఔషధాలకు పొరలా, శస్త్రచికిత్సలో కుట్లు వేసే దారంలా వాడుతారని.. అందుకే వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వాటిని అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిపల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌లో శనివారం వేలం వేయగా రూ. 4 లక్షలకు కొనుగోలు చేశారు.



Next Story

Most Viewed