- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 16 మంది ఏపీ వాసులకు సీరియస్
by Muthe.Rajitha |
ఉత్తర్ప్రదేశ్లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తర్ప్రదేశ్లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన 16 మందికి తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. అయితే వీరంతా తీర్థయాత్రలో భాగంగా వారణాసి నుంచి అయోధ్య దర్శనానికి వెళ్తుండగా జౌన్పుర్లో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. గాయపడినవారు శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి, బ్రాహ్మణతర్ల, పలాస ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు.. బాధితులను ఫోన్లో పరామర్శించారు. జౌన్పుర్ కలెక్టర్, వారణాసి విమానాశ్రయ అధికారులు, వైద్యులతో మాట్లాడారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉండాలని సంబంధిత అధికారులకు సూచించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story






