YCP: వైసీపీ కార్యాలయానికి భూమి కేటాయించండి

by Disha Web Desk 16 |
YCP: వైసీపీ కార్యాలయానికి భూమి కేటాయించండి
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశరాజధాని హస్తినలో వైసీపీ కార్యాలయం నిర్మాణానికి స్థలం కేటాయించాలని కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీని వైసీపీ ఎంపీల బృందం కోరింది.


రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్ సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీల బృందం బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. ఎంపీలు సత్యవతి, ఎంవీవీ సత్యనారాయణ, మాధవ్, బెల్లన చంద్రశేఖర్, బ్రహ్మానంద రెడ్డి, తలారి రంగయ్య తదితరులు కూడా కేంద్రమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.


మరోవైపు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజుని న్యూఢిల్లీలోని ఆయన క్యాంపు కార్యాలయంలో విజయసాయిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి అనేక న్యాయ పరమైన అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా కలియుగదైవం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను కేంద్రమంత్రికి అందజేశారు.


Next Story

Most Viewed