ఈ నెల 30న ఏపీ కేబినెట్ భేటీ

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: ఈ నెల 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాద్ దాస్ ప్రకటన విడుదల చేశారు. 30న బుధవారం ఉదయం 11 గంటలకు వెలగపూడి సెక్రటేరియట్‌లోని మీటింగ్ హాల్‌లో ఈ సమావేశం జరగనుందని ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. అలాగే కర్ఫ్యూ పొడిగించాలా లేక ఎత్తివేయాలా అన్నదానిపై కూడా చర్చించనున్నారు. అలాగే ఇప్పటికే మెగా కొవిడ్ డ్రైవ్ చేపట్టిన నేపథ్యంలో [&hellip;]</p>

cm-jagan mohanreddy
X

దిశ, ఏపీ బ్యూరో: ఈ నెల 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాద్ దాస్ ప్రకటన విడుదల చేశారు. 30న బుధవారం ఉదయం 11 గంటలకు వెలగపూడి సెక్రటేరియట్‌లోని మీటింగ్ హాల్‌లో ఈ సమావేశం జరగనుందని ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. అలాగే కర్ఫ్యూ పొడిగించాలా లేక ఎత్తివేయాలా అన్నదానిపై కూడా చర్చించనున్నారు. అలాగే ఇప్పటికే మెగా కొవిడ్ డ్రైవ్ చేపట్టిన నేపథ్యంలో వైద్య సిబ్బందికి కేబినెట్ సమావేశం అభినందనలు తెలపనుంది.

Next Story