ఆంధ్ర సరిహద్దు మూసివేత

by  |
ఆంధ్ర సరిహద్దు మూసివేత
X

దిశా, కోదాడ: ఏపీలో మధ్యాహ్నం కర్ఫ్యూ అమల్లో భాగంగా అంతరాష్ట్ర రవాణాపై మధ్యాహ్నం 12 తర్వాత ఆంక్షలు విధించారు. దీంతో అంతరాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద ఏపీలోకి వాహనాలకు ప్రవేశం లేదంటూ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అత్యవసర సేవలు ఉపయోగించుకునే వాహనాలు మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తామని ఏపీ పోలీసులు తెలిపారు.

రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్‌ల మూసివేతతో రహదారులపై భారీగా వాహనాలు నిలిచిపోయి వాహనదారులు అనేక ఇబ్బందులు పడ్డారు. నేటి నుంచి ఈ నెల 18 వరకు ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు, వైద్యులు, సిబ్బందికి మినహాయింపు ఇచ్చారు. రాకపోకల వేళల్లో విధిగా గుర్తింపు కార్డులు ధరించాలని ఆదేశించారు. బోర్డర్ చెక్ పోస్ట్‌ల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు

Next Story