కిడ్నాపర్లు అరెస్ట్

by  |
కిడ్నాపర్లు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్:
రాజేంద్ర నగర్ వైద్యుడు డాక్టర్ హుస్సేన్ కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. కిడ్నాపర్లను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నాపర్లు అనంతపురం మీదుగా బెంగుళూరు వెళ్లేందుకు ప్రయత్నించారు. కాగా కిడ్నాప్ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో అన్ని చెక్ పోస్టులను ఎస్పీ సత్యయేసు బాబు అలెర్ట్ చేశారు. ఇద్దరు కిడ్నాపర్లను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు కిడ్నాపర్లు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

కాగా హైదరాబాద్ లోని రాజేంద్రనగర్‌లో డాక్టర్ హుస్సేన్ ను కొందరు దుండగులు మంగళవారం కిడ్నాప్ చేశారు. బుర్కా ధరించి వచ్చిన కొందరు దుండగులు డాక్టర్ హుస్సేన్ ను అతని కారులోనే కిడ్నాప్ చేశారు. కుటుంబం సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.


Next Story