మొబైల్ హోమ్‌గా ఆటోరిక్షా.. ఆర్కిటెక్ట్ ఐడియాకు ఆనంద్ మహింద్రా ఫిదా!

by  |
మొబైల్ హోమ్‌గా ఆటోరిక్షా.. ఆర్కిటెక్ట్ ఐడియాకు ఆనంద్ మహింద్రా ఫిదా!
X

దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తాజాగా ఓ ఆర్కిటెక్ట్ ఐడియాను పొడుగుతూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. చెన్నై‌కు చెందిన ఆర్కిటెక్ట్ అరుణ్ ప్రభు ఆటో రిక్షాను మొబైల్ హోమ్‌గా తీర్చిదిద్దాడు. దీనిని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఆయన..‘అరుణ్ తక్కువ స్థలంలో ఎక్కువ శక్తిని ఎలా సృష్టించాలో చూపించాడు.

కానీ, అది ఒక పెద్ద ట్రెండ్ ను క్రియేట్ చేసిందన్నాడు. నిజానికి ఈ హోమ్‌ను ప్రదర్శన కోసం ఉంచాలనుకున్నాడని కూడా చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలో… ఎవరైనా మమ్మల్ని కనెక్ట్ చేయగలరా? అంటూ మహీంద్రా ట్వీట్ చేశారు. ఇదిలాఉండగా, ఆటోరిక్షా పై మొబైల్ హోం నిర్మాణానికి రూ.లక్ష ఖర్చయిందని వెల్లడించాడు.


Next Story

Most Viewed