అస్తి పంజరంగా మారిన మృతదేహం!

by  |
అస్తి పంజరంగా మారిన మృతదేహం!
X

దిశ, షాద్‌నగర్: ఉరివేసుకొని గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని కొందుర్గు మండలం చిన్న ఎల్కిచెర్ల, శ్రీరంగాపూర్ గ్రామాలకు వెళ్లే దారిలో చోటుచేసుకుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకున్న ఆనవాళ్లు ఉన్నాయి. శరీరం మొత్తం కూడా ఎముకల గూడు లాగా మారి దుర్వాసన వెదజల్లుతుండటంతో గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అదించారు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed