దారుణం: నిర్మాణంలో ఉన్నఇంటిలో వృద్ధురాలు బలి

by  |
దారుణం: నిర్మాణంలో ఉన్నఇంటిలో వృద్ధురాలు బలి
X

దిశ, ప్రతినిధి మేడ్చల్ / జవహర్ నగర్: నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లోకి వృద్ధురాలిని తీసుకొచ్చి హత్య చేసిన ఘటన ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్ గడి మలక్ పేట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు ఆదివారం ఉదయం స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి వృద్ధురాలు హత్యపై ఆరా తీస్తున్నారు.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాల్ గడి మలక్ పేట్ గ్రామానికి చెందిన లక్ష్మి (60). శనివారం అర్థరాత్రి (తెల్లారితే ఆదివారం) గుర్తు తెలియని దుండగులు అదే గ్రామంలోనే నూతన నిర్మాణంలో ఉన్న భవనంలోకి వృద్ధురాలిని తీసుకొచ్చి అతి దారుణంగా చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్,డాగ్ స్కాడ్ టీంతో సంఘటన స్థలానికి చేరుకుని, హత్య జరిగిన స్థలాన్ని శామీర్ పేట పోలీస్ స్టేషన్ స్టేషన్ సీఐ సుధీర్ బాబు అధ్వర్యంలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలిచి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.



Next Story

Most Viewed