అమ్రాబాద్ ఎంపీటీసీ టీఆర్ఎస్ లో చేరలేదు: లక్ష్మీనర్సయ్య

by  |
అమ్రాబాద్ ఎంపీటీసీ టీఆర్ఎస్ లో చేరలేదు: లక్ష్మీనర్సయ్య
X

దిశ, నిజామాబాద్: మాక్లూర్ మండలం అమ్రాబాద్ ఎంపీటీసీ కోటగిరి లక్ష్మి టిఆర్ఎస్ లో చేరలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సయ్య అన్నారు. ఇటీవల ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎంపీటీసీ లక్ష్మీ భర్తను హైద్రాబాద్ కు బలంవతంగా పిలిపించుకొని పార్టీ మారారని ప్రచారం చేశారన్నారు. బీజేపీ సిద్ధాంతాలను నమ్మినవారెవరూ పార్టీని వీడరని, కొందరిని అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు గురిచేసి, భయబ్రాంతులకు గురిచేసి పార్టీ మార్చుతున్నారన్నారు. కేవలం అధికార పార్టీ అభ్యర్థి గెలుపు కోసమే పార్టీ మార్చుతున్నారని మండిపడ్డారు. ఆయన వెంట బీజేపీ మాజీ ఎమ్మెల్యే లక్ష్మీ నారాయణ, మాజీ అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, మున్సిపల్ ప్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి ఉన్నారు.

Next Story

Most Viewed