ఆ ఘనత మోడీకే దక్కింది.. అందుకే ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి: ఎమ్మెల్యే రఘునందన్ రావు

భారత ప్రధాని నరేంద్ర మోడీ అవలంబిస్తున్న పాలనా విధానం ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేలా చేసిందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు....MLA Raghunandhan Rao Visits Jangaon

Update: 2022-09-28 16:54 GMT

దిశ, జనగామ: భారత ప్రధాని నరేంద్ర మోడీ అవలంబిస్తున్న పాలనా విధానం ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేలా చేసిందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. జనగామ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్ రెడ్డి అధ్యక్షతన భారత్ వైపు అనే అంశంపై మేధావుల సదస్సు జనగామ పట్టణంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ పాలన ప్రపంచానికే ఆదర్శమని, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ఉచిత టీకానందించి ప్రజల ప్రాణాలను కాపాడిన ఘనత ప్రధానికి దక్కిందన్నారు. దేశ భద్రత విషయంలో కట్టుదిట్టమైనటువంటి విధానాన్ని అవలంభిస్తూ, 370 ఆర్టికల్ రద్దు చేయడం, అయోధ్యలో రామ మందిర నిర్మాణం వంటి చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత మోడీకి దక్కిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేవీఎల్ఎన్ రెడ్డి, పిడుగుల రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శులు సౌడ రమేష్, శివరాజ్ యాదవ్, రాష్ట్ర నాయకులు బొట్ల శ్రీనివాస్, గాడిపల్లి ప్రేమ లతా రెడ్డి, కర్ర శ్రీనివాస్ రెడ్డి, అడ్వకేట్స్, డాక్టర్స్, టీచర్స్, వివిధ సంఘాలకు చెందిన మేధావులు తదితరులు పాల్గొన్నారు.

Similar News