అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యం..

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ లో ఉన్న పెట్రోల్

Update: 2024-04-29 12:47 GMT

దిశ,ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ లో ఉన్న పెట్రోల్ పంప్ సమీపంలో అనుమానాస్పద స్థితిలో సగం కుళ్లిపోయిన మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వివరాల్లోకెళితే వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ పెట్రోల్ పంప్ సమీపంలో సోమవారం కుళ్లిపోయిన స్థితిలో ఉన్న గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వ్యక్తి మృతదేహాన్ని పరిశీలించి మృతుడు మంగపేట మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన తండా అనిల్ (45) గా గుర్తించారు. అనుమానాస్పద స్థితిలో ఉన్న అనిల్ మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని హత్యనా,ఆత్మహత్యనా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Similar News