గంజాయి విక్రయదారుడి అరెస్ట్..

గంజాయి విక్రయాలు, వినియోగం గురించి విశ్వసనీయ సమాచారం మేరకు హన్మకొండ పోలీసులతో కలిసి కమిషనర్ టాస్క్ ఫోర్స్ గాలింపు చర్యలు చేపట్టారు. హన్మకొండ లోని సాగర కాలనీ, పోచమ్మ కుంట కు చెందిన దుబ్యాల చరణ్, హన్మకొండ వద్ద గంజాయి విక్రయాలు, వినియోగంలో పాల్గొంటున్నారు.

Update: 2023-04-26 13:55 GMT

దిశ, హనుమకొండ టౌన్: గంజాయి విక్రయాలు, వినియోగం గురించి విశ్వసనీయ సమాచారం మేరకు హన్మకొండ పోలీసులతో కలిసి కమిషనర్ టాస్క్ ఫోర్స్ గాలింపు చర్యలు చేపట్టారు. హన్మకొండ లోని సాగర కాలనీ, పోచమ్మ కుంట కు చెందిన దుబ్యాల చరణ్, హన్మకొండ వద్ద గంజాయి విక్రయాలు, వినియోగంలో పాల్గొంటున్నారు. అతని వద్ద నుంచి 300 గ్రాముల ఎండు గంజాయి ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

సుమారు దాని విలువ రూ. 12,000 ఉంటుందని తెలిపారు. విచారణలో తనకు గంజాయి అమ్మడం, తాగడం అలవాటు ఉందని, ఆ తర్వాత హన్మకొండ వడ్డేపల్లిలో నివాసముంటున్న కషాప్‌ నుంచి గంజాయిని అవసరమైనప్పుడు కొనుగోలు చేసి నగరంలో ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు వెల్లడించాడు. నిందితుడిని పట్టుకున్న వారిలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ డా.ఎం.జితేందర్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె.శ్రీనివాసరావు, జనార్దన్ రెడ్డి , ఎస్ఐ లు ఎండి. నిస్సార్ పాషా, వి. లవన్ కుమార్, శరత్, టాస్క్ ఫోర్స్ బృందం తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News