పెండింగ్ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

ప్రజావాణిలో పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు.

Update: 2023-02-06 11:13 GMT

మేడ్చల్ అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి

దిశ ప్రతినిధి, మేడ్చల్: ప్రజావాణిలో పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్ తో కలిసి ఆయన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. మొత్తం 76 దరఖాస్తులను ప్రజల నుంచి స్వీకరించామని ఆయన తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా సర్కారు ప్రజావాణిని నిర్వహిస్తోందని తెలిపారు. ప్రజలు తమ సమస్యలు తీరుతాయని ఎంతో నమ్మకంతో దూర ప్రాంతాల నుంచి ప్రజావాణికి వస్తుంటారని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అధికార యంత్రాంగం పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


Similar News