రెండు సెల్ టవర్స్ పేల్చివేసిన మావోలు
మావోయిస్టు బంద్ నేపథ్యంలో మావోయిస్టులు పలు విధ్వంసకర సంఘటనలకు పాల్పడుతున్నారు.
దిశ, భద్రాచలం : మావోయిస్టు బంద్ నేపథ్యంలో మావోయిస్టులు పలు విధ్వంసకర సంఘటనలకు పాల్పడుతున్నారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా,మోదక్ పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కందుల్ నార్ వద్ద రెండు సెల్ ఫోన్ టవర్లను తగుల పెట్టారు. రహదారులపై కందకాలు తవ్వి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారు.