ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి హైకోర్టు కీలక ఆదేశాలు.. ఎందుకంటే..?

ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Update: 2024-04-25 05:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మెట్రో లైన్ వంపుల్లో పరిమితికి మించి వస్తున్న శబ్ధకాలుష్యంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సికింద్రాబాద్ సమీపంలోని బోయిగూడ రైల్వే ట్రాక్ వంపు వద్ద మితిమీరిన శబ్ధం వస్తుందని.. నియంత్రణ చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని డాక్టర్ హన్మాండ్లు హైకోర్టుకు లేఖ రాశారు. పరమితికి మించి వస్తున్న శబ్ధంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నానరు. లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన హైకోర్టు అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

Tags:    

Similar News